కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసిన మహేష్..ఎక్కడో తెలుసా..?

Mahesh Babu
Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌లోని జుబ్లీ‌హిల్స్‌లో ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ ఫ్లాట్ ను దాదాపు రూ.26కోట్లు పెట్టి కొనుగోలు చేశారట. ఇక ఈ ఫ్లాట్ దాదాపుగా 1442 చదరపు గజాల్లో ఉంటుందని సమాచారం. నవంబర్ 17, 2021న ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగినట్టు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. స్టాంపుడ్యూటీగా దాదాపు రూ1.43కోట్లు చెల్లించారని వినికిడి. పేరు బదిలీకి గాను రూ. 39లక్షలు చెల్లించినట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం మహేశ్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్నారు. పరశురామ్ దర్శత్వం వహిస్తుండగా..కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 1న విడుదల కానుంది.