కరోనాతో భారత సంతతి శాస్త్రవేత్త మృతి
చికిత్స పొందుతూ కాప్ టౌన్ లో కన్నుమూత
Cape Town: భారత సంతతికి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గీతా రాంజీ కరోనా వైరస్ తో మరణించారు.
ఆమె లండన్ నుంచి కొద్ది రోజుల కిందట దక్షిణాఫ్రికా వెళ్లారు.
ఆ తరువాత అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు.
చికిత్స పొందుతూ గీతా రాంజీ (64) మరణించారు.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/