కరోనాతో భారత సంతతి శాస్త్రవేత్త మృతి

చికిత్స పొందుతూ కాప్ టౌన్ లో కన్నుమూత

World renowned virologist Gita Ramjee

Cape Town: భారత సంతతికి చెందిన ప్రముఖ వైరాలజిస్ట్ ప్రొఫెసర్ గీతా రాంజీ కరోనా వైరస్ తో మరణించారు.

ఆమె లండన్ నుంచి కొద్ది రోజుల కిందట దక్షిణాఫ్రికా వెళ్లారు.

ఆ తరువాత అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయని గుర్తించిన వైద్యులు చికిత్స అందించారు.

చికిత్స పొందుతూ గీతా రాంజీ (64) మరణించారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/