హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన కెసిఆర్

KCR announced Hyderabad MP candidate

హైదరాబాద్‌ః లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బిఆర్ఎస్ పూర్తిచేసింది. ఈ విషయంలో కాంగ్రెస్, బిజెపిని దాటేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ స్థానం నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ పేరును ప్రకటించారు. కాంగ్రెస్, బిజెపి మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండి కొన్ని కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండగా కెసిఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీపడే బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..

ఆదిలాబాద్‌ఆత్రం సక్కు
మల్కాజిగిరిరాగిడి లక్ష్మారెడ్డి
ఖమ్మంనామా నాగేశ్వర్‌రావు 
మహబూబాబాద్‌మాలోత్‌ కవిత
కరీంనగర్‌బోయినపల్లి వినోద్‌కుమార్‌
పెద్దపల్లికొప్పుల ఈశ్వర్‌
మహబూబ్‌నగర్‌మన్నె శ్రీనివాస్‌రెడ్డి
చేవెళ్లకాసాని జ్ఞానేశ్వర్‌
వరంగల్‌కడియం కావ్య
జహీరాబాద్‌గాలి అనిల్‌కుమార్‌
నిజామాబాద్‌బాజిరెడ్డి గోవర్ధన్‌
సికింద్రాబాద్‌పద్మారావుగౌడ్‌
నాగర్‌కర్నూల్‌ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌
భువనగిరిక్యామ మల్లేశ్‌
నల్లగొండకంచర్ల కృష్ణారెడ్డి
మెదక్‌వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్‌గడ్డం శ్రీనివాస్‌ యాదవ్‌