కెసిఆర్ ను పరామర్శించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్

కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ka-paul

హైదరాబాద్‌ః యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను సినీ, రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు, మెగాస్టార్ చిరంజీవి తదితర ప్రముఖులు ఆయనను పరామర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా కెసిఆర్ ను ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పరామర్శించారు. కెసిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు, కెసిఆర్ ను ఉద్దేశించి రెండు రోజుల క్రితం కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న అధికారులెవ్వరూ దేశం విడిచిపోకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. తెలంగాణ లక్షల కోట్ల అప్పులపాలు కావడానికి కెసిఆర్ అండ్ కో కారణమని చెప్పారు. రాష్ట్ర అప్పులపై విచారణ జరిపించాలని… అంత వరకు వీరిని దేశం విడిచి వెళ్లకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.