సికింద్రాబాద్ లో గాంధీ విగ్రహానికి నివాళ్లు అర్పించిన జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ బండి సంజయ్ చేస్తున్న దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. ఆయనను అరెస్ట్ చేసిన జైలుకు పంపించారు. దీంతో ఆయనకు మద్దతుగా శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన రాకతో హైదరాబాద్ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది.

ఒకవైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు బీజేపీ క్యాండిల్ ర్యాలీ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో బీజేపీ ర్యాలీకి అనుమతిచలేమని అధికారికంగా పోలీసులు ప్రకటించారు.అయినప్పటికీ బిజెపి నేతలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని తెలిపారు. ఈ తరుణంలో ఏంజరుగుతుందో అని అంత టెన్షన్ గా ఉన్నారు. అయితే జేపీ నడ్డా సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహానికి నివాళ్లు అర్పించారు. జేపీ నడ్డా వెంట కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు ఉన్నారు. బండి సంజయ్​ అరెస్ట్​కు నిరసనగా నడ్డా సహా భాజపా నేతలు నల్ల మాస్కులు ధరించారు.