టీడీపీ నేతలకు సవాల్ విసిరిన మంత్రి జోగి రమేష్

నవరత్నాలు ఫై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి జోగి రమేష్. నవరత్నాలు ను విమర్శించే హక్కు లేదని, దమ్ముంటే అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వం మీద ప్రకాశించని నవరత్నాలు అంటూ అవాస్తవ పత్రాలు విడుదల చేశారని మండిపడ్డారు. వైస్సార్సీపీ అమలు చేస్తున్నవి ప్రకాశించే నవరత్నాలని అన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటున్నారని, అయితే బొక్క పార్టీ నేతలకు మాత్రం అవి అర్థం కావని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలు టీడీపీ నేతలకు కనపడటం లేదా అని ప్రశ్నించారు. గడప గడపకు వెళ్లి పథకాలు గురించి అడిగిన ప్రభుత్వాన్ని, గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు.

చంద్రబాబు , అచ్చెన్నాయుడు కి దమ్ము, దైర్యం ఉంటే కుప్పం ,టెక్కలి నియోజకవర్గంలో ఎక్కడైనా చర్చకు సిద్దమని రమేష్ సవాల్ విసిరారు. 2014 నుండి 19 వరకు కుప్పం, టెక్కలి లో ప్రజలకు, ఎవరెవరికి ఏం ఇచ్చారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఎంత మేలు చేశామో చర్చించేందుకు సిద్దంగా ఉన్నామని, టైం, డేట్ ఫిక్స్ చేయాలని టీడీపీ నేతలకు సవాల్ విసురుతున్నామని జోగి రమేష్ అన్నారు. జగన్ ఏం చేశాడో, చంద్రబాబు ఏం చేశాడో ప్రజలనే అడుగుదామని అన్నారు. ఈ ఛాలెంజ్ కి దమ్ముంటే ఒప్పుకోండి, సవాల్ స్వీకరించే సత్తా ఉందా అని ప్రశ్నించారు.