విశాఖ లో జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖ లో మెగా జాబ్ మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. యువతకు మెరుగైన జీవితం కల్పించాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్ పని చేస్తున్నారని , ప్రభుత్వం రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలు కల్పించాలని సీఎం భావిస్తున్నారని విజయ సాయి అన్నారు. జాబ్ మేళా అనేది నిరంతర ప్రక్రియ. చదువుకున్న ప్రతి వ్యక్తి నిరుద్యోగిగా మిగుల కూడదు అనేది జగన్ లక్ష్యంమన్నారు.

నేడు, రేపు జాబ్ మేళా జరుగుతుంది. అవరమైతే ఎల్లుండి కూడా నిర్వహిస్తాము. 208 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. ఒక్కొక్కరు ఐదు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాము. 77 వేల మంది ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గుంటూరులో వచ్చే వారం జరగాల్సిన జాబ్ మేళా సీఎం ఢిల్లీ పర్యటన కారణంగా ఒక వారం వాయిదా పడింది అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.