62కు చేరిన జపాన్ భూకంప మృతుల సంఖ్య
టోక్యో : జపాన్ భూకంప ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శిథిలాలను తొలగిస్తున్నా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటివరకు మరణాల సంఖ్య 62కు చేరుకున్నది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉంది. దాంతో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జపాన్లోని ఇషికావా కేంద్రంగా సోమవారం 7.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మొత్తం 21 సార్లు భూమి కంపించింది. ఈ భూకంపాల ధాటికి జపాన్ కకావికలం అయ్యింది. ఇప్పటికే 62 మంది మరణించడమేగాక వందలాది మంది గాయాల పాలయ్యారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది.