తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు – సీఎం జగన్

తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగుల‌లో ప్ర‌తి కుటుంబం సుఖ‌సంతోషాల‌తో విరాజిల్లాల‌ని అభిలషించారు.

అలాగే తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం ట్విట్టర్ ద్వారా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసారు. ‘దీపావళి పండుగ శుభసందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ దీపాల పండుగ.. మనందరి జీవితాలలో ప్రగతి కాంతులు నింపాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.. దీపావళిని అందరూ సురక్షితంగా, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్ చేశారు.