మోడీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ..

pm modi & cm jagan
pm modi & cm jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , ప్రధాని మోడీల భేటీ ముగిసింది. సుదీర్ఘ కాలం తర్వాత జగన్‌తో సమావేశానికి ప్రధాని అవకాశం ఇచ్చారు. ప్రధాని మోడీతో గంటపాటు పలు అంశాలపై చర్చించారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, గోరంట్ల మాధవ్, మిథున్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండింగ్‌ సమస్యలను జగన్..మోడీకి నివేదించారు.

రాష్ట్ర విభజన ఆర్థిక ప్రగతిని తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. విభజన సమయంలో 58 శాతం, జనాభా ఏపీకి రాగా, కేవలం 45 శాతం మాత్రమే రెవెన్యూ దక్కిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఈ గణాంకాలే నిదర్శనమని ప్రధానితో జగన్‌ అన్నారు. ఏప్రిల్‌ 1, 2014 అంచనాల మేరకే పోలవరం నిధులు ఇస్తామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. 2014 తర్వాత పెరిగిన ప్రాజెక్ట్‌ వ్యయాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోలేదని’’ ప్రధానికి సీఎం వివరించారు.

‘‘ప్రాజెక్ట్‌ అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో సెక్షన్‌ 90లో పేర్కొన్న స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ప్రాజెక్ట్‌ ఆలస్యమైతే ఖర్చు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం అంచనా వ్యయాన్ని నిర్ణయించాలి. పోలవరం అంచనా వ్యయాన్ని రూ.55,657 కోట్లుగా నిర్ణయించాలి. పోలవరం నిర్మాణంపై రూ.2,100 కోట్ల పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ లోటును పూడుస్తామంటూ అప్పటి ప్రధాని ప్రకటన చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.18,830.87 కోట్లు చెల్లించాలని’’ సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.