జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
విచారణకు హాజరైన ఐఏఎస్ శ్రీలక్ష్మి, శామ్యూల్, రాజగోపాల్
హైదరాబాద్: సిఎం జగన్ అక్రమాస్తుల కేసును నాంపల్లిలోని సీబీఐ ఈడీ కోర్టు ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది. ఈ శుక్రవారం విచారణకు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, శామ్యూల్, రాజగోపాల్ హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన హాజరు కాలేదు. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో ఆయన హాజరు కాలేదని తెలుస్తోంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/