దళితుల హక్కులను జగన్ కాలరాస్తున్నారుః నక్కా ఆనందబాబు

దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని విమర్శ

nakka anand babu
nakka anand babu

అమరావతిః టిడిపి నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సిఎం జగన్ పై మండిపడ్డారు. దళితులను జగన్ మోసగిస్తున్నారని చెప్పారు. దళితుల పథకాలనే కాకుండా వారి హక్కులను కూడా హరిస్తున్నారని అన్నారు. పలు పాఠశాలలను జగన్ రద్దు చేశారని విమర్శించారు. స్కూళ్లను మూసివేయడం, రీయింబర్స్ మెంట్ రద్దుతో దళితులు నష్టపోతున్నారని చెప్పారు.

జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితుల కోసం ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని అన్నారు. దళితుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని… వారికి రక్షణ కరువైందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/