జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టు ఏఎన్ఎంల నిరవధిక సమ్మె
హైదరాబాద్ః తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా కాంట్రాక్టు ఏఎన్ఎంలు చేస్తున్న నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఈరోజు ఇందిరా పార్క్ వద్ద సమ్మె చెప్పటారు. కాంట్రాక్టు ఏఎన్ఎంలతో ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. గత 20 ఏళ్లుగా కష్టపడుతున్న వారి డిమాండ్లను పెద్ద మనస్సుతో సర్కారు నెరవేర్చాలని కోరారు. కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన సెకండ్ ఏఎన్ఎంలను తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఇటీవల విడుదల చేసిన ఎంపీహెచ్ఏ నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు ఏఎన్ఎం నాయకులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.