ఆ ముగ్గురి విడుదల కోసం ప్రార్థిస్తున్నా

Rajnath Singh
Rajnath Singh

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్లీల విడుదల కోసం తాను ప్రార్థిస్తున్నానని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. విడుదల తర్వాత రాష్ట్రంలో సాధారణ పరిస్థితి నెలకొల్పేందుకు ముగ్గురూ సహకరిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా 2019 ఆగస్టు 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలను కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎంలతో పాటు పలువురు రాజకీయ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు, వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఆపై చాలా మందిని విడుదల చేసినా వీరు మాత్రం కఠినమైన ప్రజా భద్రతా చట్టం (పీఎస్‌ఏ) కింద నిర్బంధంలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని వ్యాఖ్యానించిన రాజ్ నాథ్, వీరి విడుదలపై ఓ నిర్ణయం తీసుకోవాల్సి వుందని అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా, కశ్మీర్‌ పురోగతినే దృష్టిలో ఉంచుకుంటుందని అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/