మైత్రి తో సీతారామం డైరెక్టర్ పాన్ ఇండియా మూవీ..

అందాల రాక్షసి మూవీ తో ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ గా పరిచమైన హనురాఘవాపుడి..మొదటి సినిమాతోనే ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ని అందించి యూత్ ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కృష్ణగాడి వీర ప్రేమకథ , నితిన్ తో లై , శర్వానంద్ తో పడీపడీ లేచిమనసు చిత్రాలను తెరకెక్కించాడు. కాస్త గ్యాప్ తీసుకొని సీతారామం చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మూవీ అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. మంచి ఫీల్ గుడ్ లవ్ స్టొరీ చూసిన అనుభూతిని ప్రతి ఒక్కరికి కలిగించాడు హను.

ఈ మూవీ విజయం తర్వాత వైజయంతీ మూవీలోనే ఓ భారీ చిత్రం చేయబోతున్నాడని వార్తలు వినిపించాయి కానీ..ఇప్పుడు వైజయంతీ మూవీలో కాకుండా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా దర్శకుడు చెప్పడం జరిగిందని టాక్. త్వరలో దీనికి సంబందించిన క్యాస్టింగ్ కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రస్తుతం అగ్ర హీరోల చిత్రాలు తెరకెక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ సినిమాలు సెట్స్ ఫై ఉన్నాయి.