మునుగోడులో కాల్పుల కలకలం..

గత పది రోజులుగా మునుగోడు పేరు మీడియా లో మారుమోగిపోతున్న వేళ..ఇప్పుడు కాల్పులు కలకలం రేపింది. గురువారం రాత్రి బైక్ ఫై వెళ్తున్న వ్యక్తిపై గుర్తుతెలియని వారు మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు అతడిని నార్కట్‌పల్లి కామినేని హాస్పటల్ కు తరలించారు. బాధితుడిని నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెళ్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించారు.

 కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారంతో వార్తల్లో ప్రముఖంగా నిలిచిన మునుగోడులో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నారు. లింగస్వామి బ్రాహ్మణవెళ్లంలలో ట్రాక్టర్ డోజర్ నడిపుతున్నాడు. మునుగోడులో కొన్ని రోజుల కిందట వాటర్ ప్లాంట్ ప్రారంభించాడు. రోజూ మాదిరిగానే గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. మార్గమధ్యంలో కాపు కాచిన దుండగులు కాల్పులు జరిపారు.