యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు..

ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌పై జీఎస్టీ నిఘా విభాగం దాడులు నిర్వహిస్తుంది. సంస్థ ఆదాయం, చెల్లిస్తున్న జీఎస్టీకి తేడా ఉండడాన్ని గుర్తించిన అధికారులు ఆ మేరకు దాడులు చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలోని కావూరి హిల్స్‌లోని కార్యాలయంలో ఉదయం నుండి పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. రూ.6 కోట్లకు పైగా బకాయి ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. లోతైన పరిశీలన కోసం సంస్థ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

2013 లో మిర్చి చిత్రం తో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రభాస్ , అనుష్క జంటగా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ డైరెక్ట్ చేసారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సెస్ ను సాధించింది. ఆ తర్వాత రన్ రాజా రన్, జిల్ , భలే భలే మగాడివో , ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు , భాగమతి , టాక్సీ వాలా , సాహో , రాధే శ్యామ్ వంటి వరుస సినిమాలు నిర్మించారు. ఈ నిర్మాణ సంస్థ లో ప్రభాస్ కూడా ఓ భాగస్వామి.