రాజీవ్ హంతకుల విడుదల గవర్నర్ ఇష్టం : కేంద్రం

Chennai: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులను విడుదల చేయాలన్న తమిళనాడు ప్రభుత్వ ప్రతిపాదనను తాము తిరస్కరించినట్లు కేంద్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. అయితే వారి పిటిషన్ రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని కేంద్రం చెప్పింది. ఈ అంశంలో గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని, అది గవర్నర్ ఇష్టమని కేంద్రం తెలిపింది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/