ప్రమాదానికి గురైన హీరో గోపీచంద్
టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రమాదానికి గురైయ్యారు. ప్రస్తుతం ఈయన తన 30 వ చిత్రం చేస్తున్నాడు. గోపీచంద్కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతుంది. అయితే ఓ ఫైట్ సీన్ కోసం డూప్ లేకుండా పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు.
షూటింగ్ స్పాట్లో కాస్త ఎత్తైన ప్రదేశం నుంచి కాలు జారి కింద పడ్డాడు. అయితే అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడం తో చిత్ర యూనిట్ తో పాటు కుటుంబ సభ్యులు , అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ క్షేమంగానే ఉన్నారని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక గోపీచంద్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేసాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో పాటు ప్రముఖ తమిళ మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్నట్లు టాక్.