గూగుల్ పే కొత్త సదుపాయం
తమ ఫాస్టాగ్ ఖాతాను సులువుగా రీఛార్జ్ చేసుకునేలా యూపీఐ సౌకర్యాన్ని యాప్ ద్వారా ప్రారంభించింది

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ లావాదేవీల అప్లికేషన్ గూగుల్పే వినియోగదారులకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్ ఖాతాను సులువుగా రీఛార్జ్ చేసుకునేలా..ప్రత్యేక యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్ (యూపీఐ) సౌకర్యాన్ని యాప్ ద్వారా ప్రారంభించింది. సంస్థ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. గూగుల్పేకు ఫాస్టాగ్ ఖాతాను లింక్ చేసుకుని రీఛార్జ్ చేసుకోవడమే కాకుండా, పేమెంట్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నట్లు తెలిపింది. గూగుల్ పే ద్వారా రీఛార్జ్ చేసుకోవాలనుకునే వినియోగదారులు యాప్లోని బిల్ పేమెంట్స్ సెక్షన్ కింద ఉండే ఫాస్టాగ్ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఫాస్టాగ్ జారీ చేసిన బ్యాంకును ఎంచుకోవాలి. అనంతరం వెహికల్ నంబర్ ఎంటర్ చేసి బ్యాంకు ద్వారా పేమెంట్ పూర్తి చేయొచ్చని సంస్థ తెలిపింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/