బీజేపీకి బిగ్‌ షాక్‌ : రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజీనామా

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బిజెపి పార్టీ కి వరుస షాకులు తగులుతున్నాయి. బిజెపి పార్టీ లో రీసెంట్ గా చేరిన నేతలతో పాటు కొంతకాలంగా ఉన్న నేతలు సైతం బిజెపి కి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు. రీసెంట్ గా దాసోజు శ్రావణ్ , స్వామి గౌడ్ లు బిజెపి రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ లో చేరగా,,తాజాగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కూడా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు బుధవారం జేపీ నడ్డాకు రాపోలు ఆనంద్‌ భాస్కర్‌ రాజీనామా లేఖ పంపారు.

ఇక అంతా ఓకే అయితే రెండు, మూడు రోజుల్లోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. ఆదివారం ఆయన ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను, పరిశ్రమ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. టీఆర్ఎస్‌ పార్టీ బీఆర్ఎస్‌గా మారుతున్న క్రమంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని రాపోలు ఆనంద భాస్కర్ కోరుతున్నారు.