బిజెపిలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
హైదరాబాద్ : బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ ఛుగ్ సమక్షంలో టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బిజెపి కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ చేతుల మీదుగా బిజెపి పార్టీ మెంబర్షిప్ తీసుకున్నారు. బూర నర్సయ్యగౌడ్ తో పాటు..కాంగ్రెస్ నేత వడ్డేపల్లి నర్సింగ్రావు కుమారుడు కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన వడ్డేపల్లి రాజేశ్వర్రావు, పీసీసీ సెక్రటరీ వెంకటేష్ ముదిరాజ్, టిడిపి నేత రవిప్రకాశ్ యాదవ్ తో పాటు…పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ పాల్గొన్నారు.