థానేలోని ప్రైవేట్ ఆసుపత్రిలో మంటలు
నలుగురు రోగులు మృతి
Maharastra: వైద్యశాలల్లో అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మహారాష్ట్రలోని థానేలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మంటలు వ్యాపించాయి. బుధవారం తెల్లవారుజామున 3.40 గంటలకు ప్రైమ్ క్రిటికేర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు రోగులు మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొవిడ్, ఇతర బాధితులను మరో ఆస్పత్రికి తరలించారు. స అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరగవచ్చని అనుమానిస్తున్నారు. ఘటన సమయంలో ఆస్పత్రిలో మొత్తం 20 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి జితేంద్ర ఆహ్వాడ్ తెలిపారు
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/