దేశ రాజధానిలో మరో అగ్నిప్రమాదం

మంటల్లో చిక్కుకున్న ప్రింటింగ్ ప్రెస్

fire in Delhi
fire in Delhi

న్యూఢిల్లీ: రాజధాని ఢిల్లీలో నెల రోజుఅ వ్యవధిలో నాలుగో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారు జామున ఉత్తర ఢిల్లీలోని పత్సార గంజ్ పారిశ్రామిక ప్రాం తంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక్కడ ఉన్న ఓ ప్రింటింగ్ ప్రెస్ అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈనెల ఒకటో తేదీన పీరాగి ప్రాంతంలోని ఓ బ్యాటరీ కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అంతకుముందు డిసెంబరు నెలలో రెండు ఘోర ప్రమాదాలు జరిగాయి. అనాజ్ మండీలోని ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే ఓ బహుళ అంతస్తుల భవనంలో జరిగిన ప్రమాదంలో 43 మంది చనిపోయారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/