గణితశాస్త్రంలో ప్రావీణ్యత కోసం..
దేశంలో ఎక్కువమంది విద్యార్ధులు చదువుతోన్న సబ్జెక్టుల్లో గణితశాస్త్రం ఒకటి. లెక్కలంటే మక్కువ, ప్రావీణ్యం ఉన్నవారికి విరివిగా అవకాశాలు లభిస్తున్నాయి. బోధన, పరిశోధన, శిక్షణ, సాఫ్ట్వేర్, ఇలా పలు రంగాల్లో వీరు ప్రవేశించవచ్చు.
ఐఐటిలు, ఎన్ఐటిలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ప్రత్యేక సంస్థలు, రాష్ట్రీయ వర్సిటీల్లో గణితంలో యుజి, పిజి, పిహెచ్డి కోర్సులు చేసుకోవచ్చు. ప్రత్యేక సబ్జెక్టుగా గణితంలో చదివే అవకాశం ఇంటర్మీడియట్ నుంచి వస్తుంది.ఇంటర్లో ఈ సబ్జెక్టు చదివితే ఇంజినీరింగ్, బిఎస్సీ/బిఎ మ్యాథ్స్, ఇంటిగ్రేటెడ్ పిజి(మ్యాథ్స్) కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
డిగ్రీలో మాథ్స్ చదివినవాళ్లే పిజి ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి స్థాయి యూనివర్సిటీల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సును రూపొందించారు. ఇంటర్లో మ్యాథ్స్ చదివినవాళ్లు వీటిలో చేరవచ్చు. డిగ్రీలో మ్యాథ్స్ చదివినవాళ్లుకు అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ పిహెచ్డి కోర్సు ఐఐటిలు,సెంట్రల్ యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది.
ఐఐఎస్ఇఆర్, ఐఎంఎస్, ఇలా ప్రముఖ సంస్థల్లో ఈ కోర్సులను బోధిస్తున్నారు. దేశంలో దాదాపు అన్ని విశ్వవిద్యాయాల ప్రాంగణాల్లోనూ గణితానికి సంబంధించిన కోర్సులను అందిస్తున్నారు. పిజి స్థాయిలో వివిధ స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ:
జెఇఇతో ఇంటిగ్రెటెడ్ ఎమ్మెస్సీ, బిఎస్సి కోర్సుల్లో ప్రబేశం లభిస్తుంది. ఐఐటి-బిఎ, బిఎస్ మ్యాథ్స్, ఐఐటి-ఖరగ్పూర్, హైదరాబాద్, కాన్పూర్, రోపార్, వారణాసి, గువాహటి, గయ, ధన్బాద్- మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఐఐటి-రూర్కీ-అప్లయిడ్ మ్యాథ్స్, నిట్-ఆగర్తలా, పట్నా రవుర్కెలా, సూరత్- ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ మ్యాథ్స్ కోర్సు ఆఫర్ చేస్తోంది.ఐఐఎస్ఇఆర్ల్లో బిఎస్-ఎంఎస్ మ్యాథ్స్ డ్యూయల్ డిగ్రీ కోర్సులు ఉన్నాయి.
ఇంటిగ్రేటెడ్పిహెచ్డి:
ఐఐటిలు నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టు ఎమ్మెస్సీ(జామ్)తో ఐఐఎస్సీ, ఐఐటిలు, ఐఐఎస్ఇఆర్ల్లో ఎమ్మెస్సీ మాథ్స్, ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి, ఎమ్మెస్సీ, పిహెచ్డి డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ పరీక్ష స్కోరు ద్వారా ప్రవేశం కల్పిస్తోన్న సంస్థలు, కోర్సులు..
ఇంటిగ్రేటెడ్ పిహెచ్డి: ఐఐఎస్సీ-బెంగళూరు, పలు ఐఐఎస్ఇఆర్లు.
జాయింట్ ఎమ్మెస్సీ పిహెచ్డి: ఐఐటి- భువనేశ్వర్, ఖరగ్పూర్.
ఎమ్మెస్సీ: ఐఐటి-బాంబే, ఢిల్లీ, గాంధీనగర్, ఇండోర్, జోధ్పూర్, కాన్ఫూర్, మద్రాస్, పట్నా, రూర్కీ, రోపార్, పలు ఎన్ఐటిలు. ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ అండ్ కంప్యూటింగ్: ఐఐటిధన్బాద్,గువహటి,హైదరాబాద్, భిలా§్ు. ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్: ఐఐటి-తిరుపతి. ఎమ్మెస్సీ ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ: ఐఐటి -జోథ్పూర్ (మ్యాథమేటిక్స్-డేటా అండ్ కంప్యుటేషనల్ సైన్సెస్)
ప్రత్యేక నైపుణ్యముంటే:
గణితంలో పిజి పూర్తిచేసిన వారికి బోధన రంగంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలు, సాధారణ డిగ్రీ కళాశాలలు, ఇంజినీరింగ్ కాలేజిల్లో ఫ్యాకల్టీ పోస్టులు వేల సంఖ్యలో ఉంటాయి. ఎంసెట్,ఐఐటి-జేఇఇ పరీక్షల కోసం గణితంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉన్నవారిని ఎక్కువ వేతనంతో శిక్షణ సంస్థలు ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. మాథ్స్పై పట్టున్న శిక్షకులకు రూ.లక్షల్లో వేతనం లభిస్తోంది.
సబ్జెక్టుపై పట్టు బోధనానుభవం నైపుణ్యం, తదితరాల ఆధారంగా ఎక్కువ వేతనం అందుతుంది. ప్రముఖ సంస్థల్లో చదువుతున్న విద్యార్ధులకు బహుళజాతి సాఫ్ట్వేర్, కన్పల్టింగ్ కంపెనీలు ప్రాంగణ నియామకాల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. దాదాపు ప్రతి ప్రవేశపరీక్ష, పోటీ పరీక్షల్లోనూ క్వాంటిటెటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ తప్పనిసరిగా ఉంటున్నాయి. మ్యాథ్స్పై పట్టున్నవారు వీటిని బాగా బోధిస్తారు.అందువల్ల శిక్షణ సంస్థలు వీరికి అవకాశం కల్పిస్తున్నాయి.
ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో హోం ట్యూషన్ల కోసం డిమాండ్ పెరుగుతోంది. వాటి ద్వారా నెలకు రూ.20-30 వేలు సంపాదించుకోవచ్చు. మ్యాథ్స్ విద్యార్ధులు పోటీ పరీక్షల్లో రాణించడానికి ఎక్కవ అవకాశాలున్నాయి. ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి నిర్వహించే పరీక్షల్లో ఎక్కువ శాతం ప్రశ్నలు గణితంతో ముడిపడి ఉండడ మే దీనికి కారణం. సాఫ్ట్వేర్ రంగంలో ఆపరేషన్స్ రీసెర్చ్ అన లిస్ట్, కంప్యూటర సిస్టం అనలిస్ట్ తదితర హోదాలు మ్యాథ్స్ గ్రాడ్యుయేట్లకు అందుతున్నాయి.
పిజి అనంతరం కొన్ని సాఫ్ట్ వేర్ కోర్సులు ముఖ్యంగా డేటా సైన్స్, బిగ్డేటా, టెస్టింగ్ టూల్స్ లాంటివి నేర్చుకుని మంచి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. వివిధ ఆర్ధిక, బీమా సంస్థలు మ్యాథ్స్లో పిజి చేసినవారి ని డేటా అనలిస్ట్ ఉద్యోగానికి తీసుకుంటున్నాయి. ఇంటర్లో ఈ సబ్జెక్టు చదివితే ఇంజినీరింగ్, బిఎస్సీ/ బిఎ ఇంటిగ్రేటెడ్ పిజి(మ్యాథ్స్) కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.