రాధే శ్యామ్ నుండి ఈ రాతలే సాంగ్ విడుదల

అభిమానులు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. రాధే శ్యామ్ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.”ఈ రాతలే” అంటూ సాగే ప్రేమ గీతాన్ని చిత్ర యూనిట్ విడుదల చేసి ఆకట్టుకున్నారు.ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. యువన్ శంకర్ రాజా, హరిణి ఇవటూరి ఆలపించారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ‘ఈ రాతలే’ పాటను మేకర్స్ అనుకున్న సమయానికి విడుదల చేయలేకపోయారు. దీంతో అభిమానులు చిత్ర యూనిట్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. కాసేపటికి సాంగ్ రిలీజ్ కావడం తో కోపాన్ని తగ్గించుకున్నారు.

”ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో విడిపోనీ యాత్రికులా..” అంటూ సాగిన ఈ గీతం శ్రీతలను విశేషంగా అలరిస్తోంది. ప్రభాస్ – పూజా హెగ్డేల మోషన్ పోస్టర్స్ తో రూపొందిన ఈ సాంగ్ సినిమా నేపథ్యాన్ని ఆవిష్కరిస్తోంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో ఈ పాట విడుదలైంది. రైలులో ప్రయాణిస్తున్న తన ప్రేయసి చెయ్యిని అందుకోవాలని కారులో ప్రయనిస్తున్న ప్రేమికుడు ప్రయత్నించగా పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఈ క్రమంలో అతను ఆమెను తన కారులో ఎక్కించుకొని లోకాలన్నీ విహరిస్తున్నాడు. ఈ ప్రేమ జంట విధిని ఎదిరించి చివరకు ఒకటైనట్లు ‘ఈ రాతలే’ లిరికల్ వీడియో చెప్పకనే చెపుతుంది.

‘రాధే శ్యామ్’ సినిమాని యూవీ క్రియేషన్స్ – గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ బ్యాక్ డ్రాప్ లో 70ల కాలం నాటి ప్రేమకథతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రభాస్ ఇందులో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపిస్తుండగా.. ఆయన ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే అలరించనుంది.

YouTube video