ఢిల్లీలోని ఓపాఠశాలకు బాంబు బెదిరింపు

delhi-school-evacuated-after-bomb-threat-nothing-suspicious-found-yet

న్యూఢిల్లీః ఢిల్లీ లోని సాదిక్‌ నగర్‌ లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌కి బాంబు బెదిరింపులు వచ్చాయి. పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు ఉదయం 10: 49 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్‌ పంపారు. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యం.. ముందు జాగ్రత్త చర్యగా విద్యార్థులను వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. బాంబ్‌ డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ స్వ్కాడ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సోదాలు చేపట్టగా.. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.