దళిత బంధు ఒక పథకం కాదు..ఒక ఉద్యమం :మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్ : వైద్య, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు మంగళ వారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో ప్రారంభించారు. అనంతరం మాట్లడుతూ..దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితబంధు అనేది కేవలం ఒక పథకం కాదని… దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమమని చెప్పారు. దళితబంధు పథకం ద్వారా కేవలం ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా, వారి వ్యాపారాభివృద్ధికి అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తారని తెలిపారు. వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించబోతున్నామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/