మోడీ తీరు దొంగే.. దొంగ దొంగ అన్నట్లుంది – సిపిఐ రామకృష్ణ

CPI leader Ramakrishna
CPI leader Ramakrishna

ప్రధాని మోడీ ఫై సిపిఐ రామకృష్ణ ఘాటు విమర్శలు చేసారు. మోడీ తీరు చూస్తుంటే..దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 28 మంది వేల కోట్లు ఎగ్గొట్టి కొందరు విదేశాలకు పారిపోయారని దుయ్యబట్టారు. బ్యాంకుల్లో వేల కోట్లు కొల్లగొట్టిన వారిలో విజయ్ మాల్యా తప్ప అందరూ గుజరాత్ కు చెందిన వారేనని అన్నారు.

మోడీ ప్రధాని కావటానికి అదానీ దేశమంతా తిరిగారని.. మోడీ ప్రధాని అయిన తర్వాత అదానీని ప్రపంచ కుబేరులలో రెండవ స్ధానానికి తీసుకు వెళ్లారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాలుగేళ్ల క్రితం మాట్లాడితే ఇవాళ శిక్షలు వేశారని.. రాహుల్ గాంధీ క్వార్డర్స్ కూడా ఖాళీ చేయమన్నారని మండిపడ్డారు.