భారత్ లో కోటి దాటేసిన కరోనా కేసులు
గత 24 గంటల్లో 25,153 మందికి పాజిటివ్
New Delhi: దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఈ ఉదయానికి దేశంలో కరోనా కేసుల సంఖ్య కోటి దాటేసింది.
కేంద్ర ఆరోగ్య శాఖ కొద్దిసేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటి నాలుగు లక్షల 599కి చేరింది.
గత 24 గంటల్లో దేశంలో 25 వేల 153 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 347 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,45,136 కు పెరిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/