కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..ఓటర్లను ఆకట్లుకునేలా మేనిఫెస్టో
ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
బెంగళూరుః కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తదితర నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టోను రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులను ఆకట్టుకునేలా మేనిఫెస్టోలో హామీలను గుప్పించారు.