మంగళగిరిలో ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ. 1.12 కోట్లు కొట్టేసారు

మంగళగిరి లో ATM సిబ్బంది తమ చేతివాటం చూపించారు. ఏటీఎంలలో జమ చేయాల్సిన రూ. 1.12 కోట్లు కొట్టేసారు. సీఎంఎస్ సంస్థ పలు బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేస్తుంది. కాగా అందులో పనిచేస్తున్న కొందరు.. బ్యాంకుల ఏటీఎంలలో నగదు జమ చేయకుండా దారి మళ్లించారు.

దాదాపు కోటి 12 లక్షల నగదుకు సంబంధించి తేడా రావడంతో.. క్యాష్ జమచేసే సిబ్బందిపై యాజమాన్యం ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ స్కామ్‌కు పాల్పడ్డ ప్రధాన సూత్రధారుని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్టుగా పోలీసు వర్గాలు తెలిపాయి.