సీఎం కేసీఆర్‌తో సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, రాకేశ్ తికాయ‌త్ భేటీ

న్యూఢిల్లీ: సీఎం కెసిఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్‌తో బీజేపీ నాయ‌కులు, రాజ్య‌స‌భ స‌భ్యులు సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ నాయ‌కులు రాకేశ్ తికాయ‌త్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌తో పాటు భ‌విష్య‌త్ రాజ‌కీయాల‌పై చ‌ర్చించారు. కేసీఆర్‌తో క‌లిసి సుబ్ర‌మ‌ణియ‌న్ స్వామి, రాకేశ్ తికాయ‌త్ లంచ్ చేశారు. వారితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/