గజ్వేల్‌లో నామినేషన్ వేసిన సిఎం కెసిఆర్‌

రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించిన కెసిఆర్‌

cm-kcr-files-nomination-in-gajwel

గజ్వేల్: తెలంగాణ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కెసిఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ కు కెసిఆర్ హెలికాప్టర్ లో వెళ్లారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కెసిఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.