గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సిఎం జగన్‌ దంపతుల భేటి

ఛత్తీస్ గఢ్ కు బదిలీ అయిన గవర్నర్ బిశ్వభూషణ్

cm-jagan-meets-governor-biswabhusan-harichandan

అమరావతిః ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛత్తీస్ గఢ్ కు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి జగన్, ఆయన భార్య భారతి మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శ్రీవేంకటేశ్వరస్వామి వారి ప్రతిమను బహూకరించారు.

ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. మూడున్నరేళ్ల పాటు ఏపీకి గవర్నర్ గా సేవలందించినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీకి కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నియమితులైన సంగతి తెలిసిందే.