దేవి ఐటెం సాంగ్ కు చిరు ఫిదా అయ్యాడట

మెగాస్టార్ చిరంజీవి – దేవి శ్రీ కలయికలో వచ్చిన సినిమాల్లో సాంగ్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగా అభిమానులను ఓ ఊపు ఊపేసాయి. ఇప్పటికి ఆ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి వీరి కాంబో మరోసారి రాబోతుంది. చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కి దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవికి జంటగా శృతి హాసన్ నటిస్తోంది. చాలా రోజుల తర్వాత చిరంజీవి మాస్‌గా ఈ సినిమాలో కనించబోతున్నాడని ఇప్పటికే విడుదలైన పోస్టర్, టైటిల్ టీజర్‌ ద్వారా తెలుస్తోంది.

ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉండగా.. ఇందులో ఒకటి ఐటెం సాంగ్. ఆ ఐటెం సాంగ్‌లో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా డ్యాన్స్ చేయబోతోంది. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ఇంటస్ట్ర్‌తో ఈ సాంగ్‌కి మంచి ట్యూన్స్ అందించాడని.. అవి విన్న చిరంజీవి ఫిదా అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే రవితేజ కూడా ఈ మూవీ లో నటిస్తున్నాడు. పోలీస్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నట్లు టాక్. అంతే కాదు ఓ సాంగ్‌లో చిరంజీవి, రవితేజ ఇద్దరూ కలిసి డ్యాన్స్ వేయబోతున్నారని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజ్‌కాబోతోంది.