2442కు చేరిన కోవిడ్-19 మృతుల సంఖ్య
బీజింగ్ : చైనాలో కోవిడ్19 వైరస్ కారణంగా తాజాగా 98 మరణించడంతో మరణించిన వారి సంఖ్య 2442కు పెరిగింది. చైనాలో మొత్తం 76,936 మందికి కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా 1836 మందికి వైరస్ సోకగా, దీనివల్ల 20 మంది మృతి చెందారు. వివరాలు ఈ కిందివిధంగా ఉన్నాయి. డైమండ్ ప్రిన్సెస్2, జపాన్ 1, సౌత్ కొరియా 4, హాంగ్కాంగ్ 2, ఇటలీ 2, ఫ్రాన్స్ 1, ఇరాన్ 5, థైవాన్ 1, ఫిలిప్పీన్స్ 1, సింగపూర్ 1. భారతదేశంలోని మహారాష్ట్రలో ఐసోలేషన్ వార్డులో ఉంచిన 77 మందికి కోవిడ్ పరీక్ష నెగటివ్గా వచ్చింది. కేంద్రమంత్రి డాక్టర్ హర్షవర్దన్ కోవిడ్ తీవ్రత, ఇప్పటి వరకూ చేపట్టిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/