తెలంగాణ ప్రజలకు చిదంబరం క్షమాపణ చెప్పాలిః హరీష్‌రావు

Minister Harish Rao

హైదరాబాద్‌ః చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు. తెలంగాణ భవన్ లో మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు కత్తి కార్తీక. ఈ సందర్బంగా కండువా కప్పి కత్తి కార్తీకను పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి హరీష్‌ రావు.

అనంతరం హరీష్‌రావు మాట్లాడుతూ… నిరుద్యోగ క్యాలెండర్ అంటూ రాహుల్ గాంధీ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.. రాహుల్‌వి గ్యారెంటీలు కాదన్నారు. గారడీలు, చిదంబరం మాటలు తెలంగాణ అమరుల గాయాలను మళ్లీ గుర్తుచేశాయి.. అమరుల తల్లుల కాంగ్రెస్ పార్టీని శపిస్తున్నారని ఫైర్ అయ్యారు. చంపింది కాంగ్రెస్.. మళ్లీ సారి చెబుతుంది..

చిదంబరం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు . తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు జరిగాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. జూలైలో అత్యధికంగా 72% డెలివరీలు జరిగినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 30% డెలివరీలు మాత్రమే జరిగాయని… ప్రస్తుతం సౌకర్యాలు కల్పించడంతో గర్భిణీలు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నట్లు వివరించారు.