ప్రమాదాల ‘దారి’ నుంచి బయటపడలేమా?

రహదారి భద్రత కరవు

Road Accident
Road Accident-File

దేశంలో ప్రతి రోజూ సగటున రోడ్డు ప్రమాదాలలో 400 మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు రేపటి పౌరులే ఉంటున్నారు.

రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో 54 శాతం యువతేనని ప్రమాదాల వల్ల 60వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని ప్రభుత్వమే చెబుతుంది.

ఎయిడ్స్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులవల్ల చనిపోయే వారికంటే రహదారి ప్రమాదాలే యువతను బలిగొంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

స్వీడన్‌ రోడ్డు భద్రత విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా ఉంది. అక్కడ రహదారులు అత్యంత సురక్షితంగా ఉన్నాయి.

భద్రత ప్రమాణాల విషయంలో సర్కార్‌ ఏమాత్రం రాజీపడటం లేదు. స్వీడన్‌లో కార్లసంఖ్య బాగా పెరిగినప్పటికీ ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. రహదారుల మీద వేగం కనభద్రతకే పెద్దపీట వేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది.

ర హదారులు ప్రగతి ప్రతీకలని, నాగరికతకు ప్రతిబింబా లని అనడం సర్వసాధారణం. ఆచరణలో చూస్తే మృత్యువ్ఞకి మార్గాలని, నరకానికి దగ్గర దారులని అర్థమవుతుంది.

ఆప్ఘనిస్థాన్‌, చైనాలను మించిన ప్రమాదకర ప్రాంతా లు దేశంలోనే ఉన్నాయంటే అతిశయోక్తికాదు.

ప్రపంచం మొత్తం మీద భారతదేశంలోనే రెండో అతిపెద్ద రహదారి వ్యవస్థ ఉంది. 47.2 లక్షల కిలోమీటర్లకుపైగా రోడ్లు విస్తరించి ఉన్నాయి.

వాటి లో జాతీయ రహదారుల వాటా 2.1 శాతం. వీటిపై సంభవి స్తున్న ప్రమాదాలు మాత్రం 28 శాతం దాటింది. ప్రపంచంలో ఎక్కడా లేనన్ని రోడ్డు ప్రమాదాలు మృతుల సంఖ్య భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి.

విశ్వవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలలో బలి అవుతున్న వారు 12.6 లక్షలకు మించి ఉన్నారు. భారత్‌లో వీరి సంఖ్య లక్షా యాభైవేలు దాటడంఆందోళన కలిగించే అంశం. క్షత గాత్రుల సంఖ్య దానికి నాలుగింతలు ఉంటుంది.

దేశంలో ప్రతి రోజూ సగటున రోడ్డు ప్రమాదాలలో 400 మంది ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వీరిలో అత్యధికులు రేపటి పౌరులే ఉంటు న్నారు.

రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్న వారిలో 54 శాతం యువతేనని ప్రమాదాల వల్ల 60వేల కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని ప్రభుత్వమే చెబుతుంది.

ఎయిడ్స్‌, కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులవల్ల చనిపోయే వారికంటే రహదారి ప్రమా దాలే యువతను బలిగొంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. స్వీడన్‌ రోడ్డు భద్రత విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా ఉంది.

అక్కడ రహదారులు అత్యంత సురక్షితంగా ఉన్నాయి. భద్రత ప్రమాణాల విషయంలో సర్కార్‌ ఏమాత్రం రాజీపడటం లేదు.

స్వీడన్‌లో కార్ల సంఖ్య బాగా పెరిగినప్పటికీ ప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. రహదారుల మీద వేగం కన్న భద్రత కే పెద్దపీట వేయడమే దీనికి కారణంగా కనిపిస్తుంది.

ప్రతి లక్ష జనాభాకు రహదారి మరణాల రేటును 3 నుంచి 4కు పరిమి తం చేయడంలో స్వీట్జర్లాండ్‌, నెదర్లాండ్‌, మాల్దీవ్ఞలు, డెన్మార్క్‌ సింగపూర్‌, ఇజ్రాయేల్‌ పోటీపడుతున్నాయి. చిన్న పిల్లలకు రహ దారి భద్రత పరికల్పనలో దక్షిణ కొరియా విశ్వానికే విశిష్ట నమూ నాగా ఉంది.

1992 నుండి అక్కడ పధ్నాలుగు సంవత్సరాలలోపు బాలల మరణాలను 97 శాతం నివారించారంటే అక్కడ ప్రభుత్వ చిత్తశుద్ధికి దర్పణంగా నిలుస్తుంది.

మత్తు పదార్థాల వినియోగంపై ఆంక్షల అమలు, సీటు బెల్టు ధరించి కారు నడపడం, మొదలైన విషయాలలో అంటి అంటనట్టు ఉండకుండా చైనా చాలా కఠి నంగా ఉంటుంది.

అధికాదాయ దేశాలతో పోలిస్తే దిగువ మధ్యా దాయ దేశాలలోనే రహదారి ప్రమాదాలలో అసువ్ఞలు బాసిన వారు ఎక్కువగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

అంతేకాదు 80శాతం దేశాలలో విక్రయిస్తున్న వాహనాలు మౌలిక భద్రతా ప్రమాణాలకు తగినట్టుగా లేవని 120 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేవలం 44 దేశాలలోనే హెల్మెట్‌ధారణ చట్టాలున్నాయని తెలియచేసింది.

భారతదేశంలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 87 శాతం 13 రాష్ట్రాల్లోనే చోటు చేసుకున్నాయి. దీనిలో ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానం, తెలంగాణ 9వ స్థానం పొందాయి.

వాహనాల సంఖ్య గణనీయంగా ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఢిల్లీ, ముంబయి, కలకత్తా నగరాలలో ప్రాణనష్టాలు తగ్గుముఖంపట్టగా, చెన్నై, బెంగళూరు, జైపూర్‌ హైదరాబాద్‌ నగరాలలో ప్రాణనష్టాలు అధికంగా ఉన్నాయి.

84 శాతం రోడ్డు ప్రమాదాలకు 80 శాతాని కిపైగా అర్థాంతర చావులకు, సుమారు 84శాతం మేర గాయా లకు వాహన చోదకులు చేస్తున్న పొరపాట్లే కారణంగా కనిపిస్తున్నాయి.

చరవాణితోనే ముప్పు వస్తుందనేది అనుభవంలో చూస్తున్నాం.

సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ లేదా సందేశం పంపుతూ వాహనాలు నడపడమే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమనడంలో సందేహం లేదు.రోడ్డు భద్రత విషయంలో రాజీపడితే వచ్చే విపత్తును ప్రభుత్వం గుర్తించడం లేదు.

చట్టాల అమలులోని లొసుగులు, అధికారుల అవినీతితో అధికశాతం కేసులు బుట్ట దాఖలు అవుతున్నాయనేది వాస్తవం.

రెవెన్యూ, ఎక్సైజ్‌, శాఖలతోపాటు రవాణా వ్యవస్థ కూడా అవినీతికి కేంద్రబిందువ్ఞగా ఉందనేది జగమెరిగిన సత్యం. ప్రజలలోరోడ్డు భద్రతపై అవగాహన లేమి, మితిమీరిన వేగం, ప్రభుత్వ ఉదాసీనత, చట్టాల అమలులో చిత్తశుద్ధి లోపించడం, డ్రైవింగ్‌ రాకపోవడం, సరిగ్గా చేయకపోవడం.

మద్యపానం చేసి వాహనాలను నడపడం, రహదారి డిజైనింగ్‌ లోపాలు, రోడ్డు నిర్వహణ లోపాలు, ట్రాఫిక్‌ సిబ్బందికి ఆధునిక శిక్షణ లేకపోవడం,కార్లలో ఎయిర్‌బ్యాగ్‌ వాడక పోవడం, ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకపోవ డం .

మద్యపాన నిషేధాన్ని అమలు చేయకపోవడం మొదలైనన్నీ కారణాలుగా చెప్పవచ్చు. సేఫ్‌ డ్రైవ్‌- సేవ్‌ లైఫ్‌ నినాదం ప్రచారంలో బాగుంది. కాని ఆచరణలో సత్ఫలితాలను ఇవ్వడం లేదు.

2016లో ఆమోదించిన మోటార్‌ వాహనాల చట్టం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయన్నది నిజమైనా అది అమలు జరిగే తీరు మీద ఆధారపడి ఉంది.

చరవాణి వినియోగం, శిరస్త్రాణంను ధరించకపోవడం, కారు బెల్ట్‌ పెట్టుకోకపోవడం మద్యం తాగడం, అక్రమ లైసెన్సును కలిగి ఉండటంపై అధికారులు ప్రధానంగా దృష్టిపెడితే మంచి ఫలితాలు ఉంటాయి.

ఏడాదికోసారి భద్రతా వారోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నా రోడ్డు మరణాల సంఖ్య తగ్గకపోవడం ఆందోళనను కలిగించే విషయం.

మొక్కు బడిగా జరిపే వారోత్సవాలవల్ల ఒరిగేది సున్నా. రహదారిభద్రతను గాలికి వదిలేస్తే ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలవకుండా ఎలా ఉంటాయి. ప్రభుత్వం ప్రజలు ఆలోచించవలసిన విషయం. అశ్రద్ధ చేయకూడని అంశం.

కనీసం ఇప్పటికైనా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరవాలి. రోడ్డు ప్రమాదాలను అదుపులోకి తేవాలి. దీర్ఘ కాలిక ప్రణాళికలురచిస్తున్న స్వీడన్‌, నెదర్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి ఐరోపా దేశాల స్ఫూర్తిని తీసుకొని ముందుకు పోవాలి.

  • ఆచార్య గిడ్డి వెంకటరమణ

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/