50 మంది ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు..ఊడిన బస్ చక్రాలు
ప్రయాణికులు సేఫ్
అమరావతిః శ్రీకాకుళం జిల్లాలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని సోంపేట మండలం పలాసపురం వద్ద పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్ వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా బస్ పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. బస్ డ్రైవర్ చాకచక్యంగా బస్ను ఆపడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. కాగా ప్రయాణికులను మరో బస్లో గమ్యస్థానాలకు చేర్చారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/national/