కేసీఆర్ ఫై బీజేపీ నేత లక్ష్మణ్ ఫైర్

టిఆర్ఎస్ పార్టీ అధినేత , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. రేపు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్న తరుణంలో బిజెపి నేతలు ఆ ఏర్పాట్లలో బిజీ గా ఉన్నారు. కాగా మోడీ హైదరాబాద్ కు వస్తుంటే..ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కర్ణాటక కు వెళ్తుండడం ఫై లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ పలు వ్యాఖ్యలు చేసారు. ప్రధాని ముందు ముఖం చెల్లకనే సీఎం కేసీఆర్ రాష్ట్రం విడిచిపోతున్నాడని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ విమర్శించారు.

సంప్రదాయాలను పాటించకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ చర్యలు తెలంగాణ సమాజం అసహయించుకుంటోందని అన్నారు.ప్రధానిని ముఖ్యమంత్రి స్వాగతం పలికే ఆనవాయితీని కేసీఆర్ కాలరాశాడని విమర్శించారు. సొంత రైతులను వదిలేసి, ఇతర రాష్ట్ర రైతులకు డబ్బులు ఇస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని లక్ష్మన్ ఎద్దేవా చేశారు. ఇక ఎయిర్ పోర్టులో పార్టీ తరుపున ప్రధానికి సన్మాన కార్యక్రమం ఉంటుందని, ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీ ప్రసంగించే అవకాశం లేదని లక్ష్మణ్ తెలిపారు. మాట్లాడితే అంతకంటే సంతోషం మరొకటి లేదని అన్నారు.