బిగ్ బాస్ 5 : ఫస్ట్ వీక్ నామినేషన్ లో యాంకర్ రవి..?

బుల్లితెర ప్రేక్షకులతో పాటు యావత్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆదివారం (సెప్టెంబర్ 05 ) అట్టహాసంగా మొదలైంది. మొత్తం 19 సభ్యులతో ఈసారి బిగ్ బాస్ అంతకు మించేలా ఉండబోతుందని అర్ధమవుతుంది. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారిలో అన్ని రంగాల వారు ఉండడం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. యాంకర్లు, డ్యాన్సర్లు, సింగర్, యాక్టర్లు, సోషల్ మీడియా సెలెబ్రిటీలు ఇలా అందరూ ఉన్నారు. హౌస్ లో పదిమంది ఆడవారు ఉంటె..తొమ్మిది మంది మగవాళ్లున్నారు. ఫస్ట్ డేనే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రకరకాల టాస్క్ లు ఇచ్చి చెమటలు పట్టించారు. గ్రాండ్‌గా మొదలైన ఈ సీజన్ మొదటిరోజు మూడు గంటల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ను అందించింది. ఇక ఒక్కొక్కరుగా కంటెస్టెంట్స్ వారి స్టైల్ లోనే హౌజ్ లోకి అడుగు పెట్టారు.

ఇక బిగ్ బాస్ స్టార్ట్ అయ్యిందో లేదో..లీకులు బయటకు రావడం మొదలయ్యాయి. మొదటి వారం నామినేషన్లో ఎవరెవరు ఉన్నారో ఆ లిస్ట్ బయటకు లీక్ అయ్యింది. అయితే నామినేషన్ ప్రాసెస్ ఏంటి? ఎలా జరిగింది అనే విషయాలు మాత్రం బయటకు రానప్పటికీ.. మొదటి వారం ఇంటి నుంచి బయటకువెళ్లేందుకు ఈ సభ్యులు సిద్దమయ్యారంటూ వార్తలు బయటకొచ్చాయి. వారిలో యాంకర్ రవి, మానస్, హమీద, సరయు, కాజల్, జెస్సీ పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఎవరు మొదటి వారం ఇంటి నుండి వెళ్తారో చూడాలి.

ఇక బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన 19 మంది ఎవరంటే…

మొదటి కంటెస్టెం‍ట్స్‌గా సిరి హన్మంత్‌, ఆ తర్వాత వీజే సన్నీ, లహరి షారి, సింగర్‌ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్‌, మహమ్మద్‌ ఖయ్యూం (లోబో ), సినీ నటి ప్రియ , జెస్సీ ( జశ్వంత్‌ పడాల ), ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక సింగ్‌, షణ్ముఖ్ జస్వంత్, నటరాజ్ మాస్టర్,సరయు, సీరియల్ నటుడు విశ్వా, ‘కార్తిక దీపం’ సీరియల్‌ ఫేమ్‌ ఉమాదేవి, నటుడు మానస్‌ , ఆర్జే కాజల్, శ్వేత వర్మ చివరగా యాంకర్‌ రవి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.