పవన్-చంద్రబాబు కాఫీ తాగితే..వైస్సార్సీపీ నేతలు మూడు చెరువుల నీళ్లు తాగారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు మరోసారి కలవడంతో వైస్సార్సీపీ నేతలు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. వారి కామెంట్స్ కు టీడీపీ , జనసేన నేతలు సైతం ఎదురు దాడికి దిగుతున్నారు. సంక్రాంతి మామూళ్ల కోసం వెళ్లాడంటూ మంత్రి అమర్నాథ్ ట్వీట్ చేయగా.. డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లాడంటూ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

వైస్సార్సీపీ నేతల ట్వీట్లకు టీడీపీ నేత సోమిరెడ్డి వ్యంగ్యంగా కౌంటర్‌ ఇచ్చారు. బాబు-పవన్ భేటీతో వైస్సార్సీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని.. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్తగా డైపర్లు వాడండంటూ ఎద్దేవా చేశారు. అలాగే మాజీ మంత్రి అయ్యాన్న పాత్రుడు కూడా తన స్టైల్ లో స్పందించారు.పవన్,బాబు కప్పు కాఫీ తాగారు..వైస్సార్సీపీ నేతలు మూడు చెరువుల నీళ్లు తాగారు అంటూ అయ్యన్న పాత్రుడు ఎద్దేవా చేసారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్టీ ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి బాబు ను పవన్ కలిశారు. ప్రస్తుతం ఏపీలో జీవో 1 ను జగన్ సర్కార్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం బహిరంగ సమావేశాలు , సభలు , ర్యాలీలకు పలు ఆంక్షలు విధించారు. పార్టీల నేతలు ఏంచేయాలన్న పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే. వారు ఎక్కడ సభ పెట్టమంటే..అక్కడ పెట్టాలని లేదంటే లేదని ఆంక్షలు విధించారు.

ఈ తరుణంలో చంద్రబాబు కుప్పం పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఈ విషయమై పవన్ ఆదివారం చంద్రబాబు ను కలిసినట్లు తెలుస్తుంది. సమావేశం అనంతరం మీడియాతో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడారు. కుప్పం లో జరిగిన సంఘటన పై కలిశామని.. వైస్సార్సీపీ అరాచకాలపై మాట్లాడుకున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు హక్కు అని.. కానీ అడ్డుకుంటున్నారు..ఏపీలో వైస్సార్సీపీ అరాచక పాలన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తెచ్చారని జగన్ తీరు మండిపడ్డారు. వైస్సార్సీపీ తెచ్చినవి.. చెత్త జోవో లు వీటికి బ్రేక్ వేయాలన్నారు పవన్‌ కళ్యాణ్‌. వైజాగ్ లో కూడా నన్ను అడ్డుకున్నారని ఆగ్రహించారు.