ఉక్రెయిన్‌కు అధ్యక్షుడు జో బైడెన్‌

వాషింగ్టన్: ఉక్రెయిన్‌ పై రష్యా యుద్ధం కొనసాగుతుంధి. అయితే ఉక్రెయిన్‌కు సంఘీభావంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ త్వరలో రాజధాని కీవ్‌లో పర్యటించే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా అమెరికాకు చెందిన కీలక నాయకులు కీవ్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆదివారంనాడు అమెరికా స్పీకర్‌ నాన్సీ పెలోసీ కీవ్‌లో పర్యటించి ఉక్రెయిన్‌కు మరింత సాయం అందిస్తామని ప్రకటించారు. అక్కడి నుంచి సరిహద్దున ఉన్న పోలండ్‌కు చేరుకున్నారు.

వార్సాలో సోమవారంనాడు అధ్యక్షుడు ఆంద్రజెజ్‌ దుడాతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు అండగా నిలిచి ఉదారంగా సాయం చేస్తూండటాన్ని ప్రశంసించారు. రష్యా యుద్ధం మొదలైన తరువాత 55 లక్షలమంది వలసవెళ్లారని, వారిలో 30 లక్షలమంది కేవలం పోలండ్‌లోనే తలదాచుకున్నారని, ఇంతమందికి ఆశ్రయం ఇవడం సాధారణ విషయం కాదని ఆమె అన్నారు. నాటో విస్తరణ అంశంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/