మరోసారి బోయిన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌కు అఖిల‌ప్రియ

కిడ్నాప్ కేసులో ప్ర‌ధాన నిందితురాలిగా అఖిల ప్రియ

హైదరాబాద్:‌ ఏపి మాజీ మంత్రి అఖిల ప్రియ కిడ్నాప్‌ కేసులో మ‌రోసారి బోయిన్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్‌కు వచ్చారు. కోర్టు ఆదేశాల మేర‌కు బోయిన్ ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి ఆమె సంత‌కం చేయ‌డం ఇది రెండోసారి. సంత‌కం చేసిన అఖిల‌ప్రియ మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాల‌తో తాము పోలీసుల విచార‌ణ‌కు స‌హ‌క‌రిస్తున్నామ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులోనూ విచార‌ణ‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తాము ఈ కేసు విష‌యంలో ఎవ‌రితోనూ ఎలాంటి సంప్ర‌దింపులు జ‌ర‌పలేద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, బోయిన్‌ప్లలి అపహరణ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న‌ భూమా అఖిలప్రియ 15 రోజుల క్రితం కూడా పోలీస్ స్టేష‌న్ కు హాజరై ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేసిన విష‌యం తెలిసిందే. ప్రతి 15 రోజులకోసారి పీఎస్‌కు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో ఆమె ఆ మేర‌కు న‌డుచుకుంటున్నారు.