గవర్నర్ తప్పును తప్పు అని చెబితే రాజకీయాలు అంటగడతారా?: బండి సంజయ్
గవర్నర్ రబ్బర్ స్టాంపులా ఉండాలని బిఆర్ఎస్ భావిస్తోందన్న బండి సంజయ్
హైదరాబాద్ : గవర్నర్కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని కరీంనగర్ ఎంపీ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే చెడ్డవారు అవుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం ఏ ఫైలు పంపించినా దానిపై ముద్ర వేస్తే గవర్నర్ను మంచివారు అంటారని, లేకుంటే తప్పులు పడతారన్నారు. గవర్నర్ తన విచక్షణాధికారాలు వినియోగించి తప్పులు తప్పు అని చెబితే రాజకీయాలు అంటగడుతున్నారన్నారు. అధికార బిఆర్ఎస్ పార్టీ గవర్నర్ ఓ రబ్బర్ స్టాంప్లా ఉండాలని కోరుకుంటున్నారన్నారు.