TSPSC పేపర్ లీకేజీ కేసు సిట్​కు అప్పగించడం ఫై బండి సంజయ్ ఫైర్

TSPSC పేపర్ లీకేజీ ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం గా మారింది. దీనికి పాల్పడిన నిందితులను అదుపులోకి తీసుకోగా …ఈ ఘటన ను సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీట్ కు బదిలీచేశారు. ప్రభుత్వం ఈ కేసును సీట్ కు బదిలీచేయడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ కేసును నీరుగార్చేందుకే సిట్​కు అప్పజెప్పారని మండిపడ్డారు. ఇప్పటికే సిట్​కు అప్పగించిన నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ.. ఇలా సిట్‌కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయని ఆరోపించారు. ఈ కేసులో సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బండి సంజయ్‌ అన్నారు.

అలాగే పేపర్ లీకేజీ వ్యవహారంపై టీఎస్​పీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వారిని వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు.