తెలంగాణలో ఉపాధ్యాయ, పోలీసు నియామకాలకు త్వరలో నోటిఫికేషన్లు

ఖాళీల లెక్క తేల్చాలని కెసిఆర్ ఆదేశాలు..మొత్తం ఖాళీల లెక్క తేలితే వరుసగా నోటిఫికేషన్లు

TRS supports Bharat Bandh: KCR
TS CM KCR

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే ఉపాధ్యాయ, పోలీసు నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సిఎం కెసిఆర్‌ వెల్లడించారు. అవే కాకుండా, ఇతర విభాగాల్లోనూ ఖాళీల ఆధారంగా మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు సేకరించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

కాగా, రాష్ట్రంలో వివిధ శాఖల్లో కలిపి సుమారు 50 వేల వరకు ఖాళీలు ఉన్నట్టు ప్రాథమిక సమాచారం ఉందని, వేల సంఖ్యలో ఉపాధ్యాయ, పోలీసు రిక్రూట్ మెంట్ జరగాల్సి ఉందని, ఇతర శాఖల్లోని ఖాళీలను కూడా భర్తీ చేస్తామని సిఎం పేర్కొన్నారు. ఇంకా మరికొన్ని శాఖల్లో ఎంతమంది ఉద్యోగులు అవసరమన్నది తేల్చాలని, మొత్తం ఖాళీలు లెక్కతేలిన వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని సిఎం కెసిఆర్ తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/