ఫస్ట్ టైం కమర్షియల్ యాడ్‌లో కనిపించబోతున్న బాలయ్య

నందమూరి బాలకృష్ణ ఫస్ట్ టైం కమర్షియల్ యాడ్‌లో కనిపించబోతున్నారు. ఇంతవరకు వెండితెర , బుల్లితెర ఫై సందడి చేసిన బాలకృష్ణ..ఇక ఇప్పుడు కమర్షియల్ యాడ్‌లలో కూడా దుమ్ముదులిపేందుకు సిద్ధమయ్యారు. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయిప్రియ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ యాడ్‌లో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఇక యాడ్ రంగంలోకి తొలి అడుగు పెడుతున్న బాలయ్యకు ఈ సందర్భంగా శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు తెలిపింది. ఈ వార్త చూసి నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ బాలయ్య తన సత్తా చాటుతుండటంతో అభిమానులు గర్వంతో కాలర్ ఎగరేస్తున్నారు. మరి ఈ యాడ్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ‘వీరసింహారెడ్డి’ చిత్రం చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో బాలకృష్ణ కు జోడి గా శృతి హాసన్ నటిస్తుంది. అలాగే బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ టాక్ షో రెండో సీజన్‌ను ఇటీవల ప్రారంభించాడు. మొత్తం మీద బాలయ్య బుల్లితెర , వెండితెర పైనే కాకుండా కమర్షియల్ యాడ్స్ లలో కూడా బిజీ గా ఉన్నారు.