జనసేన ఆఫీస్ ఫై వైస్సార్సీపీ కార్యకర్తల దాడి

JanaSena Party
JanaSena Party

ఏపీలో వైస్సార్సీపీ vs జనసేన గా మారింది. పవన్ వైజాగ్ పర్యటన ను అడ్డుకోవడం , ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నేతలపై దాడి చేసారని జనసేన కార్య కర్తలను అరెస్ట్ చేయడం, పవన్ కళ్యాణ్ ను సైతం హోటల్ కే పరిమితం చేయడం పట్ల పవన్ తో పాటు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కళ్యాణ్ సైతం వైస్సార్సీపీ నేతల ఫై పలు కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపై వైస్సార్సీపీ నేతలు వరుస పెట్టి విమర్శలు చేయడం, పవన్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం వంటివి చేస్తున్నారు.

ఇదిలా ఉంటె శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని జనసేన పార్టీ కార్యాలయంపై వైస్సార్సీపీకి చెందిన కార్యకర్తలు దాడికి దిగారు. జనసేన కార్యాలయంపై ఒకేసారి 30 మంది వైస్సార్సీపీ కార్యకర్తలు దాడికి దిగారు. తమ పార్టీ కార్యాలయంపై వైస్సార్సీపీ శ్రేణులు దాడికి దిగాయని జనసేన కార్యకర్తలు తెలిపారు. ఈ దాడిలో జనసేన కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసమైంది. ఈ ఘటనతో టెక్కలిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.